దైవ చింతనతోనే ప్రశాంతత .. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంగారెడ్డి ఎంఐజీ రామాలయం సందర్శన

దైవ చింతనతోనే ప్రశాంతత .. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంగారెడ్డి ఎంఐజీ రామాలయం సందర్శన

రామచంద్రాపురం, వెలుగు: దైవ చింతనతోనే మానసిక ప్రశాంతతం లభిస్తుందని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్​ బీఆర్​ నాయుడు చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా భారతీనగర్​ డివిజన్​ పరిధిలోని ఎంఐజీ రామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో త్వరలో ప్రతిష్ఠించనున్న 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎల్ఐజీ కాలనీలోని పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నారు.

ఆలయ కమిటీ సభ్యులు బీఆర్​నాయుడు దంపతులకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్​ మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు, దేవాలయాల నిర్మాణాలకు తనవంతు సాయం అందిస్తానని అన్నారు.

కరీంనగర్ ‌‌లో రూ. 75 కోట్లతో, కొడంగల్​లో రూ.114 కోట్లతో ఆలయాలు నిర్మించబోతున్నట్లు వివరించారు. ఖమ్మం, సిద్ధిపేట, దుబ్బాక, మంథని తదితర ప్రాంతాల్లో ఆలయాలతో పాటు ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో గురజాల శ్రీనివాస్​, యాదగిరి రెడ్డి, సత్యనారాయణ, యాదయ్యగౌడ్​, మురళీకృష్ణ, చెన్నకేశవ రావు, సీవీఎస్​ కుమార్​ పాల్గొన్నారు.